మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని రేగుపల్లి గ్రామానికి చెందిన మోతుకూరి ఆనందం(40) ప్రమాదవశాత్తు గోదావరిలో కాలు జారిపడి మృతి చెందారు. ఆనందం రోజు మాదిరిగానే పశువులను మేతకు తోలుకొని గ్రామ శివారులోని గోదావరి ఒడ్డుకు వెళ్ళాడు గోదావరి వరదల కారణంగా ఒడ్డు మొత్తం ఒండ్రు మట్టి తో ఉంది అయితే పశువులు నీళ్లు త్రాగిన తరువాత వాటిని ఒడ్డుకు తోలుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి గోదావరిలో పడిపోయారు నీటిలో పడి ఈతరాక నీటిలో మునిగిపోయి ఊపిరి ఆడక చనిపోయారని మృతిని భార్య స్వరూప ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: