మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని రఘునాదపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన నాగలక్ష్మి (45) సం,,అనే వివాహిత మహిళల తేలు కాటుకి గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామపంచాయతిలో పరిధి పల్లె ప్రకృతి వనం పక్కన ఎర్పాటు చేసిన ఫారెస్ట్ నర్సరీలో రోజు వారి కూలీగా పనికి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలను ట్రాక్టర్ లో లోడింగ్ చేస్తున్న క్రమంలో తెలుకాటు వెయ్యడంతో వెంటనే అక్కడ ఉన్నారు హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మణుగూరు తిసుకెళ్ళు తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలుకి భర్త, ఒక్క కూతురు,కుమారుడు ఉన్నట్లు తెలిపారు. అమె మృతితో రఘునాధపాలెం గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ పోలెబోయిన నర్సిహరావు సందర్శించి ప్రగాఢంగా సంతాపం తెలిపి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని బరోస కల్పించారు.
Navigation
Post A Comment: