మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: కిడ్నీ వ్యాధితో చనిపోయిన బెండాలపాడు గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు బచ్చల కృష్ణయ్య (55) కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం బెండాలపాడు గ్రామంలో కృష్ణయ్య భౌతికగాయాన్ని ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు.నివాళులర్పించిన వారిలో గానుగుపాడు సహకార సంఘం అధ్యక్షులు చెవుల చందర్రావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు,రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ బొర్ర లలిత, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాలోతు బోజ్యనాయక్,మేడ మోహన్ రావు,కాంగ్రెస్ నాయకులు కేశబోయిన నరసింహారావు, బొర్ర.సురేష్ తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: