ములకలపల్లి:(జులై 10):
మన్యంమనుగడ ప్రతినిధి: మండలంలోని,పాత గంగారం గ్రామ పంచాయితీ లొని,కొత్త గంగారం,అల్లి గుంపు,పాత గంగారం,పాలవాగు,ముత్యాలంపాడు గ్రామస్తు లకు ఉచిత వైద్య ఆరోగ్య శిభిరం నిర్వహించారు.ఈ వైద్య శిభిరం నందు వచ్చిన రోగులందరికి ఉచితంగా బిపి, షుగర్, హీమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి తగిన మందులు అన్ని శ్రీ గౌరీ హాస్పిటల్ వారు ఉచితంగా అందించారు.ఈ వైద్య శిభిరం లో గర్భిణీ లు, వృద్దులు, చిన్నపిల్లలు దాదాపు 378 మంది పాల్గొని చికిత్స పొందారు.ఈ సందర్బంగా ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగుల కు డాక్టర్ సోమరాజు దొర పలు ఆరోగ్య సూచన లు ఇస్తూ,ప్రతి వ్యక్తి కూడా వ్యక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ,వైద్యాధి కారుల సూచన మేరకు మందులు వాడాలని సూచనలు చేసారు.ఈ వైద్య శిభిరం లో డాక్టర్ శ్రీనివాసరావు, రేఖల రమేష్, బసవాపురం రమేష్, సంపత్, వీరాస్వామి,సాయి, చిరుమప్ప, స్థానిక సర్పంచ్, శ్రీ గౌరీ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: