మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామంలో నున్న రైల్వే బ్రిడ్జి దగ్గర కోడిపుంజుల వాగు గత నాలుగు రోజులు నుండి కురుస్తున్న భారీ వర్షాలు కు,సర్వీస్ బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం ఉదృతం గా ప్రవహిస్తుంది.ఈ బ్రిడ్జ్ దగ్గర కు కూనవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్,ఎంపీటిసి ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు హుటాహుటిన వెళ్లి వరద ప్రవాహం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తెప్పించి రోడ్డు కు అడ్డంగా పెట్టించి,రాక పోకలు జరగ కుండా తగు జాగ్రత్త లు తీసుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,గత రెండు రోజుల క్రితం కోడిపుంజుల వాగు లో ఒక వ్యక్తి మరణించడం తో ముందస్తు గా,ఈ చర్యలు తీసుకుంటున్నామని,అందుకు సింగరేణి కార్మికులు, యాజమాన్యం సహకరించి సి టైపు బంగ్లోస్ కాలనీ,మల్లారం కాలనీ,ఎం సి కాలనీ కి వెళ్లే కార్మికులు కూనవరం గ్రామం, బాంబే కాలనీ మీదుగా వెళ్ళగలరని కోరారు. అదేవిదంగా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు,రేగుల గండి చెరువు నిండి అలుగు ఉదృతం గా ప్రవహిస్తునందున చేపల వేటకు వెళ్ళవద్దని ప్రాణాలు పోగొట్టుకోవద్దని కోరారు.ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది వి ఆర్ ఏ భాగ్య లక్ష్మి, పంచాయతీ సిబ్బంది కంగాల. తాత రావు చెట్టిపల్లి.వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: