మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర,జిల్లా ప్రజలకు ముస్లిం సోదర, సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,త్యాగం,సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ,ఈ పండుగ జరుపుకొంటారన్నారు.భక్తి భావం,విశ్వాసం,కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు.అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: