CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రవేటికరణకు వ్యతిరేకంగా జరిగే ధర్నాలను జయప్రదం చేయండి:సింగరేణి కార్మికులకు ఎంపీటీసీ గుడిపూడి విజ్ఞప్తి.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


కేంద్రం లో నున్న బి.జె.పి నరేంద్ర మోడీ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సింగరేణి సంస్థను ప్రవేటికరణ, కాంట్రాక్టీకరణ చేయడానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం *టి బి జి కే యస్* ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం నాడు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జ్ లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేయడం పట్ల ఎం పి టి సి ల ఫోరమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు కార్మిక సోదర సోదరీ మణులందరికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈనెల 12 వ తారీఖున జి.ఎం ఆఫీస్ ఎదుట ధర్నా,18వ తారీకున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా ను జయప్రదం చేయగలరు అని కోరడం జరిగింది.సింగరేణి నీ ప్రవేటికరణ చేయడం వలన కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటాయని,కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరం గా ఉంటుంది అని,భవిష్యత్ లో టి బి జి కే యస్ ఆధ్వర్యంలో జరిగే పోరాటంనకు కార్మికులు సంపూర్ణ మద్దతు తెలపాలని ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు కోరారు.

Share it:

TS

Post A Comment: