మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ, జేఏసీ నిర్ణయం మేరకు మంగపేట మండల కేంద్రం లో 3వ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి హామీని నెరవేర్చదాక మేము సమ్మె చేస్తామని ఈ సందర్భంగా సమ్మె లో పాల్గొన్న వీఆర్ ఏ లు తెలియజేయడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెలో మంగపేట మండల అధ్యక్షులుపాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మక్క, రాము, సమ్మయ్య , రాజేశ్వరి, పగిడమ్మా, రాణి, ఈశ్వరమ్మ, శ్రీను , నర్సింహా మూర్తి, మాధవి, ఖాజా, వెంకట నర్సమ్మ , ముజాఫర్, నరేష్, రాంబాబు, సందీప్ , శిరీష, ముత్తయ్య, వీ ఆర్ ఏ లు పాల్గొన్నారు,
ఇట్టి 3వ రోజు సమ్మెకు మద్దతు తెలుపుతూ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన వీ ఆర్ ఓ ల సంఘం. నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ మాతో కలిసి భోజనం చేసిన తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్,ఆర్ ఐ లుఏ ఎస్ ఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మరియు వీ ఆర్ ఓ లుహాజరై సంఘీభావం తెలిపినారు.
Post A Comment: