మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకుల తో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,జులై 30వ తేదీ శనివారం నాడు పినపాక నియోజకవర్గం పరిధిలోని పినపాక,మణుగూరు,అశ్వాపురం,బూర్గంపాడు,మండలాల లోని పలు గ్రామాలలో గోదావరి వరద బాధితులు,ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేందుకు, అదేవిధంగా వారికి అండగా ఉండేందుకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్డ ఎత్తున బియ్యం,నిత్యాసర సరుకులు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ లు బండి పార్థసారథి రెడ్డి,నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర,మాలోత్ కవిత,రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ తాత మధు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోరం కనకయ్య,తో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారని వారు తెలియజేశారు.కావున ఈ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విప్ రేగా కాంతారావు కోరారు.
Post A Comment: