CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోజు ఆలస్యంగా విధులకు ప్రధానోపాధ్యాయురాలు... ఆగ్రహం వ్యక్తం చేసిన మద్దుకూరు గ్రామస్తులు...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ప్రతి రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తూ, తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ప్రధానోపాధ్యాయురాలు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్దుకూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూర్య పాఠశాల ప్రారంభం నుంచి తరచూ ఆలస్యంగా పాఠశాలకు రావడం, సెలవు పెట్టకుండా గైర్హాజరు కావడం, తెల్లవారి బడికి వచ్చి హాజర్ రిజిస్టర్ లో సంతకం పెట్టడం పరిపాటిగా మారింది. దీంతో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ద్వారా సమాచారం అందుకున్న గ్రామస్తులు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ పాఠశాలకు గురువారం ఉదయం వెళ్లగా ప్రధానోపాధ్యాయురాలు కుర్చీ ఖాళీగా ఉండడంతో వెంటనే గ్రామస్థులతో కలిసి, ఆయన ఎంఈఓ సత్యనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్ ఫోన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం 11 గంటల ఈ సమయంలో పాఠశాలకు వచ్చి కుర్చీల్లో కూర్చొన్నారు. ఈ విషయంపై కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్ ను వివరణ కోరగా తాను పాఠశాలకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని, సెలవు అయితే అందలేదని, సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: