CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం..

Share it:

 


  • ఆదివాసి నాయకులంతా కదిలి రావాలని తెల్లం నరసింహారావు దొర పిలుపు..


జూలూరుపాడు జులై 3, (మన్యం మనుగడ) ప్రతినిధి, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తెల్లం నర్సింహరావు దొర ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 8వ తారీఖున జిల్లాస్థాయి పాలకమండలి సమీక్ష సమావేశం భద్రాచలం పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ఆదివాసి నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, మహిళలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఆదివాసి సమాజం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పైన, చట్టాల ఉల్లంఘన పై, ప్రభుత్వ అధికారులు ఆదివాసీలపై చూపుతున్న వివక్ష, తదితర అంశాల పైన ఈ సమీక్ష సమావేశంలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.

Share it:

TS

Post A Comment: