CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బోనాల మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా..

Share it:


 మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గుర్రాలచెరువు గ్రామ శివారులో ఉన్న స్వయంభు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆషాడ బోనాల మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నా, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఆషాడ బోనాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలయ విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున గాని నా తరపున గాని ఆలయానికి ఏమైనా పనులు ఉంటే నాకు తెలియజేయండి, వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కనక దుర్గ అమ్మవారి ఆలయం నుండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లి ముత్యాలమ్మను, దర్శించుకొని అక్కడ మహిళలతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బోనాలు ఎత్తుకున్నారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద నుండి అధిక సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకుని, కనక దుర్గ అమ్మవారి ఆలయం కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల టిఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: