మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వరావుపేట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి అధ్యక్షతన అశ్వరావుపేట మండలంలో మొదట విడతగా దళిత బందుకు ఎంపికైన 31 మంది లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఆన్ని రంగాలలో లబ్ధి పొందాలని, వారీ అభివృద్ధికి అవసరమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన దళిత బంధు పథకానికి మొదట విడతలో 31 మంది లబ్ధిదారులు లబ్ది పొందారాని, అశ్వారావుపేట నియోజక వర్గంలో అశ్వారావుపేట మండలానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి 31 మంది దళితులు అభివృద్ధికి సహకరించిన మన అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా సోమవారం నాడు ఆగస్టు 1వ తేదిన అశ్వారావుపేట గిరిజన భవనంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు వారు యూనిట్ లను అందజేయటం జరుగుతుందని, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విద్యాధర రావు, ఇతర అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: