మన్యం మనుగడ వాజేడు జూలై 29:. ఎక్కడో కొండల్లో కోనల్లో జన ఆవాసాలకు దూరంగా, ప్రకృతి ఒడిలో, పక్షుల కిలకిలలు, కోయిలమ్మ కోతలు, చుట్టూ పచ్చని చెట్లు ఎత్తయిన కొండల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం ఒకే ఒక్క ఆదివాసి తెగ నివసిస్తుంది. ఆ గ్రామం పేరు పెనుగోలు, గ్రామానికి వెళ్లాలి అంటే రహదారి సౌకర్యం లేదు, కాబట్టి కాలినడకన నాలుగు కొండలు ఎక్కి దిగాలి, 18 కిలోమీటర్లు నడిస్తే గ్రామం చేరుకుంటారు. పెనుగోలు గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసినా వాజేడు పిహెచ్సి డాక్టర్ మకిడి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మూడు రోజుల ప్రయాణంలో వాగులు,వంకలు, దాటుకుంటూ ఆ గ్రామంలో వైద్య క్యాంపులు నిర్వహించారు, పెనుగోలు గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించగా,బొగ్గుల సత్యం అనే వ్యక్తి కి జ్వరం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, హెల్త్ వర్కర్ వెంకటేష్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: