మన్యం మనగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఆదివాసీ గ్రామమైన చింతలపాడు లో సీజనల్ వ్యాధుల పైన అవగాహన కార్యక్రమాన్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధుల పైన ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ కుమార్ మాట్లాడుతూ, దోమల ద్వారా మలేరియా, డెంగి, టైఫాయిడ్, డయేరియా, మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని , తగు జాగ్రత్తలు తీసుకోవాలని చింతలపాడు ప్రజానీకానికి వివరించారు. లక్షణాలు కనిపించిన వారికి రక్త నమూనాలు సేకరించారు. జలుబు వంటి వ్యాధులకు మందులు అందజేశారు. ఈ కార్యక్రమం లో హెచ్ఈ ఓ వీరస్వామి, ఎంటిఎస్ అరుణ్ బాబు,వెంకట్, అరుణ, ఆశా లావణ్య, తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: