గుండాల జూలై 1(మన్యం మనుగడ) నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని డి ఆర్ డి ఓ స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలో పర్యటించారు. కాచనపల్లి నుండి గుండాల వరకు రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయితీలో గల నాటిన ప్రతి మొక్క బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హజరత్ వాలి, ఏపిఎం రవితేజ, కార్యదర్శులు అకుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: