గుండాల జూలై 4(మన్యం మునగడ) రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని బి.ఎస్.పి ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. పోడు భూముల సమస్య ఎక్కువగా ఉన్న ఏజెన్సీలో పోడు పట్టాలను అందించాలని కోరారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయాలని ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని నాయకులు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తరుణంలో ఇచ్చిన హామీలన్నిటిని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి కొత్తగూడెం జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు, మండల అధ్యక్షులు మల్లయ్య, శోభన్, ప్రశాంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: