CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సోమవారం జరుగు చలో ఐ టి డీ ఏ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి:సీపీఐ, పిలుపు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


జులై 11 వ తేదీన గిరిజనులకు పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, గిరిజన సమైక్య,వ్యవసాయ కార్మిక సంఘము ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం,నిర్వహించనున్నామని దీనికి పెద్ద ఎత్తున పొడు సాగుదారులు,తరలి రావాలని సీపీఐ మణుగూరు మండల, పట్టణ కార్యదర్శులు జంగం మోహనరావు,దూర్గ్యల సుధాకర్,గిరిజన సంఘము జిల్లా నాయకులు సొంధే కుటుంబరావు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని,గిరిజన సాగులో ఉన్న పొడు భూములకు పట్టాలివ్వాలి అని డిమాండ్ చేసారు.భూమిలేని గిరిజనులకు 3 ఎకరాల భూమి పంచాలని,గిరిజనులపై పోలీసులు పెట్టిన కేసులు ఉపసంహరించికోవాలి అన్నారు,పొడు సాగుదారులపై ఫారెస్ట్ దాడులు ఆపాలని, భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు.సాగునీటి సౌకర్యం లేని భూమి ఉన్న గిరిజనులకు,ఐటీడీఏ ద్వారా వ్యవసాయ బోర్లు మంజూరు చేసి విద్యుత్ 3 ఫేస్ సౌకర్యం కల్పించాలని,గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.సోమవారం జరుగు చలో ఐటీడీఏ ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో మాజీ మండల కార్యదర్శి ఎస్కె సర్వర్, కార్యవర్గ సభ్యులు కె వి నారాయణ,వార్డు మెంబెర్స్ప్. కణితి సత్యనారాయణ,వజ్జా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: