జూలూరుపాడు జులై 20, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల కేంద్రంలో ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయినట్లు తెలిపారు. సహకరించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జమ్మి యశ్వంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గుగులోత్ వంశీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని, జిల్లా వ్యాప్తంగా ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, అందించడంలో, యూనిఫాం సకాలంలో ఇవ్వడం లేదనీ అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనీ, అన్నారు. విద్యార్థులకు జిల్లాలో 40 శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే అందించారని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, సరిపడా మెనూ చార్జీలు పెంచాలనీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ లు అందించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు భవాని, అఖిల్, మంజుల, ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు గణేష్, అఖిల్, సింధు, అనిల్, విజయ్ కుమార్. ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడాల అఖిల్, ఎస్.కె చాంద్ పాషా, పవన్, కత్తి వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: