మన్యం మనుగడ వాజేడు జూలై 29:. తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ, జేఏసీ నిర్ణయం మేరకు వాజేడు మండల కేంద్రం లో 25-07-2022 నుండి పూర్తిస్థాయి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి తెలిపాము,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి హామీని నెరవేర్చదాక మేము సమ్మె చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఇట్టి 5 వ రోజు నిరవధిక సమ్మెలో వాజేడు మండల అధ్యక్షులు కుందమల్ల సురేష్,ఉపాధ్యక్షుడు, తాటి బాలకృష్ణ, మహిళ ఉపాధ్యక్షురాలు, చుంచు అనూష,కుందమల్ల నాగరాజు, కావిరి బాలచంద్రమూర్తి, షేక్ నన్నేమియా, అట్టం కృష్ణారావు, కాట తిరుపతమ్మ, వేల్పుల ఉదయ, జాడీ మల్లయ్య,గజ్జల రాంబాబు జాడి తిరుపతి తెల్లం శ్రీ లక్ష్మీ, వి ఆర్, ఏ లు పాల్గొన్నారు,
ఇట్టి 5 రోజు సమ్మెకు మద్దతుగా, వాజేడు మండలం, లోని Rmp డాక్టర్లు నర్సింహారావు,మోగిలి,లీలాకుమారు,శంకర్ ,కిషోర్ మరియు తహసీల్దార్ ఆఫీసు సర్వేయర్ వెంకటయ్య గారు హాజరై సంఘీభావం తెలిపినారు.
Post A Comment: