గుండాల/ఆళ్లపల్లి జూలై 21(మన్యం మనుగడ) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యవసర వస్తువులపై జిఎస్టిని భారీగా పెంచడం దారుణమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. గురువారం మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువులపై పన్ను ద్వారా మోపడం ఎంతవరకు సమంజసంమన్నారు నిత్యవసర వస్తువులను జీఎస్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ బాబు, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యకర్తలు సతీష్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నా రు
Post A Comment: