CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద బాధితులకు అన్నదానం.

Share it:

 


దమ్మపేట జూలై 21 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు మండల పశువైద్య అధికారి మన్యం రమేష్ బాబు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి నాగార్జున ఆధ్వర్యంలో కుకునూరు గ్రామం లోని వరద బాధితులకు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు పశువైద్యాధికారి మన్యం రమేష్ బాబు మాట్లాడుతూ వరద బాధితులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఈ వరదల వల్ల బాధితులు చాలా బాధలో ఉన్నారని వారికి అన్నదానం చేయటం మాకు చాలా సంతృప్తి కలిగించిందని వారన్నారు కొంతమంది నిర్వాసితులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని తెలంగాణ రాష్ట్రం చాలా సుధీర ప్రాంతం నుండి వచ్చి మాకు అన్నదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేసినట్టు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్త రూరల్ రిపోర్టర్ గంగాధర్ శ్రీనివాస్ ప్రజాతంత్ర రిపోర్టర్ ఎస్కే గోరె మనం పేపర్ రిపోర్టర్ టి మల్లేశ్వరరావు టైమ్ టుడే రిపోర్టర్ గట్ల శ్రీనివాసరావు మన తెలంగాణ రిపోర్టర్ దర్శి పని కుమార్ శ్రీరాములు సత్యనారాయణ తీర్ధాల వేణు కందుకూరి సాయి మన్యం ఆర్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: