మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలో శుక్రవారం రోజంతా మళ్లీ కుంభవృష్టి వాన కురిసింది.వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి అయిదు రోజులు గడవక ముందే తిరిగి శుక్రవారం నుంచి మళ్లీ ఏటూరునాగారం ఏజన్సీ ఏరియా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రంతా కుంభవృష్టి కురియగా,శనివారం కూడా ముసురు కొనసాగింది.దీంతో మంగపేట మండలంలోని జనజీవనం మళ్లీ పూర్తిగా స్తంభించింది.ఏజన్సీ ఏరియా వ్యాప్తంగా చెరువులు-కుంటలు,ప్రాజెక్టులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.మంగపేట మండలంలో రెండేళ్ళ క్రితం నూతనంగా ఏర్పడిన కొత్తూరు-మొట్లాగూడెం గిరిజన గ్రామపంచాయతీ అధికారులు "పల్లెప్రగతి" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన "పల్లెప్రకృతి వనం" కురిసిన అతి భారీ వర్షానికి,వరదలకు పూర్తిగా కొట్టుకుపోయి కనీస ఆనవాళ్ళు కూడా లేకుండాపోయింది.దాదాపుగా రూ, అయిదు లక్షల వ్యయం తో ఏర్పాటు చేసిన అందమైన "పల్లెప్రకృతి వనం" కనీస ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోవడం అధికారులను,ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది.అంతే కాకుండా "పల్లెప్రకృతి వనం"లో సేద తీరేందుకు వచ్చి అక్కడే పార్కింగ్ చేసిన ఇరువురి గ్రామస్థుల మోటర్ సైకిళ్ళు కూడా వరద ఉధృతి కి కొట్టుకుపోయి వాగులో కలసి పోయాయి.అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ కు పలుచోట్ల అవాంతరాలు ఏర్పడ్డాయి. లోతట్టుప్రాంతాలలోని పలువురు ఇళ్లకు మళ్లీ వర్షపు వరద నీళ్లు చేరాయి.పూరిల్లు కూలాయి.పలు రోడ్లు కోతకు గురయ్యాయి. ఇంకొన్ని చోట్ల గండి పడ్డాయి.
Post A Comment: