ములకలపల్లి :మన్యంమనుగడ ప్రతినిథి :
మండలంలో నూతనంగా నియమించబడిన జనసేన పార్టీ మండల కమిటీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం,యువజన విభాగం ఆధ్వర్యంలో మండల కమిటీకి ఘనంగా సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల కమిటీలు మండల అధ్యక్షులు మరియు మిగతా సభ్యులకు విద్యార్థి యువజన విభాగం కలిసి నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు ములకలపల్లి మండలంలో జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని,ఈ సభ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం నాయకులు వల్ల వీరభద్రం మరియు వంశీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరిక రాంబాబు,మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శి పూకే నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చామర్తి సుధాకర్, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లు నరసింహ రావు, బాధావత్ రవికుమార్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు తాటికొండ వినీత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: