మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీ టీ ఏ) ఆధ్వర్యంలో 40 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఎన్ఆర్ఐ కునారపు ప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన 40 గోదావరి వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు మంగళవారంతెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీ టీ ఏ) ఆధ్వర్యంలోఎంపీపీ గుమ్మడి గాంధీ,టీ టీ ఏ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రసాద్ కునారపు లు ఏడూళ్ల బయ్యారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. అదేవిధంగాగత కొంతకాలం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కొంపటి బాలరాజు కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎన్ఆర్ఐ ప్రసాద్ అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిని,ముల్లంగి వెంకట్ రెడ్డి, బూర రమేష్ గౌడ్, కూనరపు రాము,తొలెం శ్రీను,ఎంపీటీసీ కాయం శేఖర్,సూర నర్సింహులు,కటకం గణేష్ సోంపేల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: