CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద ముంపు ప్రాంతాన్ని సందర్శించిన హెల్త్ డైరెక్టర్..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని యం.కాశీనాగారం గ్రామంలో వరద ముంపు గురైన ప్రాంతాలను హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు, అదనపు హెల్త్ డైరెక్టర్ అమర్ సింగ్ పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పలు ఇళ్లలో తిరిగి పరిసరాలను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వరద ముంపు గ్రామాల్లో వారం రోజులపాటు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి రోజు యాంటీబయోటిక్ ఆపరేషన్ నిర్వహించి, రోజు గ్రామంలో పర్యవేక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఎంహెచ్వో డా.దయానంద్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా. జయలక్ష్మి,డా. వినోద్ కుమార్, డా.చేతన్, డా. మన్ దీప్,డా.చైతన్య,డా.వసుంధర మండల ప్రాథమిక వైద్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: