మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లక్ష్మీ నగరం గ్రామపంచాయతీలో కన్నాపురం గ్రామంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు నోముల రామ్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఒక నష్టపోయిన ప్రతి రైతు కి విత్తనాల పంట ఖర్చును ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి తాటిపూడి రమేష్, గ్రామస్తులు సిద్ధి వెంకటరమణ, సురేష్, అశోక్ పాల్గొనడం జరిగింది..
Post A Comment: