మన్యం టీవీ మణుగూరు:
బిజెపికి దమ్ముంటే వారు అధికారం లో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు అమలు చేయాలి అని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు చేసే దమ్ము బిజెపికి ఉందా? ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రజలందరూ అభినందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.బిజెపి అధికారం లో ఉన్న రాష్ట్రాలలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారని అన్నారు.దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బిజెపి తట్టుకోలేక పోతున్నద అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసింది ఏమైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు.తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని బిజెపి ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.బిజెపి పార్టీ ఎన్ని దండయాత్రలు చేసిన ప్రజలు ఆదరణ ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేదని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటే బిజెపికి మింగుడు పడడం లేదని విమర్శించారు.సీఎం కేసీఆర్ ను జాతీయ స్థాయి రాజకీయాలకు బిజెపి మేతర పార్టీలు నాయకులందరూ ఆహ్వానిస్తుంటే బిజెపి నాయకులలో వణుకు మొదలైంద అన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే బిజెపి సభలతో తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.
Post A Comment: