గుండాల/ఆళ్లపల్లి జూలై 28(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామానికి చెందిన రైతులు ఇల్లందు డిఎస్పి రమణమూర్తికి రేంజర్ పై ఇచ్చిన ఫిర్యాదు పై టేకులపల్లి సిఐ వెంకటేశ్వర్లు గురువారం విచారణ చేశారు, ఎంపీపీ మంజు భార్గవి , స్థానిక సర్పంచ్, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఐ వెంకటేశ్వర్లకు రైతులు తమ సమస్యలను వివరించారు, అనంతరం ఎంపీపీ మంజు భార్గవి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఇల్లందు డీఎస్పీ రమణమూర్తికి రైతులతో కలిసి ఫిర్యాదు చేశామని దానిపై విచారణకు రావడం జరిగిందన్నారు మా వైపు నుండి పూర్తిగా పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చామని ఆమె పేర్కొన్నారు
Post A Comment: