మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని సీతానగరం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న సాగి రాజేశ్వరి గుండెపోటుతో మరణించారు నాలుగు రోజుల క్రితం ఆమెకు గుండె పోటు రాగా వుటా హుటినహైదరాబాద్ తరలించి చికిత్స ఇప్పిస్తూ ఉండగా చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు అంగన్ వాడి వ్యవస్థ ప్రారంభం అయిన తొలినాళ్లలో 1982 సంవత్సరం లో భద్రాచలం అంగన్ వాడి ప్రాజెక్టు పరిధిలో సీతానగరం అంగన్ వాడి కార్య కర్తగా ఉద్యోగంలో చేరారు. అంగన్వాడీ కార్యకర్త గా అంకితభావంతో పనిచేసి ఎనలేని సేవలు అందించారు పర్ణశాల సెక్టార్ అంగన్వాడీ టీచర్లు తోపాటు దుమ్ముగూడెం ప్రాజెక్టు లో పనిచేస్తున్న పలువురు అంగన్వాడీ టీచర్లు ఆమె మృతికి సంతాపం తెలిపారు దుమ్ముగూడెం ప్రాజెక్టు సిడిపిఓ నవ్య శ్రీ సూపర్వైజర్లు లతోపాటు అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సిఐటియు నాయకులు ఆమె మృతి పట్ల విచారాన్ని వ్యక్త పరిచారు.
Post A Comment: