CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

''దళిత బందు" యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు..

Share it:

 



జూలూరుపాడు జులై 29, (మన్యం మనుగడ) ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "దళిత బందు" పథకం ఫలాలు (యూనిట్ల) ను శుక్రవారం వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం దళితులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. కావున లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, మండల ప్రత్యేక అధికారి భీమ్లా, తహశీల్దార్ విల్సన్, ఎంపీడీవో రవి, ఎంపీఓ రామారావు, ఎంపీపీ సోనీ, జెడ్పిటిసి కళావతి, వైస్ ఎంపీపీ నిర్మల, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ వీరభద్రం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారావు, పార్టీ సీనియర్ నాయకులు గిరిబాబు, సురేష్, రాంబాబు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: