గుండాల జూన్ 26(మన్యం మనుగడ) పినపాక నియోజకవర్గం లో చివరి లబ్ధిదారుడు వరకు దళిత బందు చేరుతుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం గుండాల మండలం సాయనపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర శ్రీను బొలెరో వాహనాన్ని మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ప్రతి ఒక్క దళిత లబ్ధిదారునికి చేరుతుందన్నారు. బ్యాంకుతో ఎటువంటి లింకేజీ లేకుండా నేరుగా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు అందించే గొప్ప పథకం దళిత బందుఅన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అని ఆయన పేర్కొన్నారు
Navigation
Post A Comment: