గుండాల జూన్ 9(మన్యం మనుగడ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి జిల్లా కమిటీ నాయకులు విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పించారు. బాటన్న నగర్, కాచన పల్లి, మామ కన్ను గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గ్రామంలో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివే విధంగా ప్రయత్నించాలని వారు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంధా నాయకులు శంకరన్న, వెంకన్న, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపాటి పృథ్వి, నాయకులు స్వాతి, శ్వేత, పార్థసారథి, వంశి వర్ధన్, ప్రణీత్ రాజ్, రంగవల్లి, మేనక, నందిని , జ్యోతి, లక్ష్మి, సాయి, తరుణ్, జ్ఞానేశ్వరి, శ్రీలక్ష్మి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: