మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సింగరేణి అతిథిగృహంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ను శుక్రవారం నాడు మణుగూరులో RTO యూనిట్ ఆఫీస్ ఏర్పాటు గురించి మణుగూరు ద్విచక్ర వాహన షోరూములు & లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు శ్రీ రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రకాల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు, మణుగూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఇందుకు అనుగుణంగా ద్విచక్ర వాహన షోరూములు 14 కార్ షోరూం లు.2 ట్రాక్టర్ షోరూమ్ లు 5, సెకండ్ హ్యాండ్ ద్విచక్రవాహనాలు షోరూం లు 6, లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారందరూ, పినపాక నియోజకవర్గం లోని కరకగూడెం, పినపాక, మణుగూరు అశ్వాపురం మండలం చెందిన వాహన రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్స్ ట్రాన్స్ఫర్ తదితర పనుల నిమిత్తం భద్రాచలం వెళ్లవలసిన అవసరం వస్తుంది, కరకగూడెం పినపాక మండలం నుండి 100 కిలోమీటర్లు పైన ఉన్నటువంటి భద్రాచలం కి వెళ్ళవలసి వస్తుంది దీనివలన, వాహనదారులు ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు దూర ప్రాంతం కావడంతో వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు, కావున మణుగూరు మండల కేంద్రలో కొత్తగా RTO యూనిట్ ఆఫీస్ ఏర్పాటు చేయగలరని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారికి వినతి పత్రం అందజేశారు వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు,
Post A Comment: