మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండలం పరిధిలోని రేపల్లెవాడ గ్రామశివారులోని స్మశానవాటిక దగ్గర ఎదుళ్లవాగు నుండి ట్రాక్టర్ లో ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం దాడి చేసి పట్టుకొని, ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ అనుమతులు ఉంటేనే ఇసుక రవాణా చేయాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: