దామెర రాకేష్ ది కేంద్ర ప్రభుత్వ హత్య..కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం..రాకేష్ కుటుంబానికి సానుబూతిని తెలియజేస్తున్నాం..కేంద్ర ప్రభుత్వం భాద్యత వహించాలి..
అగ్నిపద్ రద్దు చేయాలంటూ నిరసన తెలుపుతున్న ఆర్మీ విద్యార్థులపై సికింద్రబాద్ లో కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోని రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు.. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని వరంగల్ నర్సంపేట నియోజకవర్గం దబ్బీర్ పేటకు చెందిన దామెర రాకేష్ ఈ కాల్పుల్లో మృతి చెందారు..
ఈ ఘటనను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత తీవ్రంగా ఖండించారు.కేంద్ర ప్రభుత్వం దేశానికి సేవ చేసే సైనిక వ్యవస్థను నిర్విర్యం చేస్తూ ప్రశ్నించిన వాళ్ళను కాల్చి చంపడం హేయమైన చర్య అని..ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు..ఒక పేద విద్యార్థిని బలితీసుకున్నారని,ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు..దామెర రాకేష్ ది కేంద్ర ప్రభుత్వ హత్య అన్నారు..రాకేష్ మృతి పట్ల సంతాపం తెలిపారు*..*వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు..దేశంలో ఒక భయానక వాతావరణం సృష్టించేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని,దేశ ప్రజలు వారికి బుద్ది చెప్పాలని ఎం.పీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు*
Post A Comment: