మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మేజర్ గ్రామ పంచాయతీ లోని ఎర్పాటు చేస్తున్న క్రీడా మైదానం పనులను, అదే విధంగా దళిత బంధు లబ్ధిదారులు నిర్మించే యూనిట్ల పనులను పరిశీలించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి పల్లేలో పిల్లలు ఆడుకోవాలనే ఉద్దేశంతో ప్రతీ గ్రామంలో ఎంతో ఖర్చుతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నారనీ తెలిపారు. అలాగే దళిత బంధు పథకం కింద కొన్ని కోట్లు ఖర్చు చేసి దళితులు కూడా ఉన్నత స్థాయికి రావాలని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని, అలా ఇచ్చే దానిలో మొదటి విడత గా అశ్వారావుపేట మండలం లో 31 మంది దళితులు లబ్ధి పొందుతున్నారని, ఈ ఒక్క లబ్ధిదారులు వచ్చిన యూనిట్ లను సద్వినియోగం చేసుకొని కెసిఆర్ ఆశయాన్ని నిలబెడదామని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ హరికృష్ణ, స్పెషల్ ఆఫీసర్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: