CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధిక ఫీజుల పేరుతో పేదల జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి PDSU డిమాండ్

Share it:

 * 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

  అధిక ఫీజులు వసూలు చేసే ప్రవేట్ ,కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు యనగంటి వంశీ వర్థన్, ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎ. పార్థసారథి అన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

ఇల్లందు పరిసర ప్రాంతాలల్లో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు అన్నారు.ఫీజుల నియంత్రణ పై కమిటీలు, చట్టాలు ఎన్ని చేసిన వాటితో సంబంధం లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విద్యాసంవత్సరం ఇప్పటికే తల్లిదండ్రులపై ఫీజులు భారాన్ని విపరీతంగా మోపాయి అని వీటిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు దృష్టి సారించి నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప నోరు మెదపడం లేదు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో పుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫామ్, టైలు షూ ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం పేదల జేబులను గుల్ల చేస్తున్నాయి అని వారు అన్నారు. తక్షణమే ఫీజులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు బి. సాయి నాయకులు తరుణ్ గంగాధర గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: