దమ్మపేట జూన్ 06 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావవ దినోత్సవాని ప్రభుత్వం ఘనంగా జరుపుతున్నారు ప్రజలకు మాత్రం తెలంగాణ ఫలాలు అందని ద్రాక్షగా మిగిలినవి కొందరికి మాత్రమే ఆనందోత్సవాలలో ఉన్నారని మేం భావిస్తున్నాం. వీటితో పాటు న్యాయం కూడా బహుదూరమైన దాని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము అన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రాష్ట్రంని ముప్పై మూడు జిల్లాలుగా విభజన చేసి పరిపాలిస్తున్నారని, ఇప్పటికి కొన్ని సంస్థలు ఉమ్మడి జిల్లాగానే పరిగణించబడుతున్నయని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ముప్పై మూడు జిల్లాలలో న్యాయ పరిపాలక జరుగుతుందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రెవెన్యూ జిల్లా లు వారిగా కోర్టులు ఉంటాయని కొత్తగా 23 జిల్లాలకు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ n v రమణ CM చంద్రశేఖర్ రావు o1 న అయిదు గంటలకు ప్రారంభించడం జరిగింది . ఇప్పటివరకు దమ్మపేట అశ్వారావుపేట మండలాలు పూర్తిగా సత్తుపల్లి కోర్టు పరిధిలో ఉన్నాయని గత నాలుగు దశాబ్దాలుగా మండలాలలో ప్రజలు సత్తుపల్లి కోర్టు ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారని ఇప్పటివరకు ఈ మండలాల్లో క్రిమినల్ సివిల్ కేసులు 1400 దాకా ఉన్నాయని ఈ మండలాల్లో ప్రజలు సత్తుపల్లికి 15 నుoచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన న్యాయ ప్రయోజనాలు పొందుతున్నారు
కాని ఇప్పుడు ఈ మండలాలలో ప్రజలు కొత్తగూడెం jfcm కోర్టుకు వెళ్లాలంటే కనీసం 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసి వస్తుందని , ఈ సౌకర్యలు కూడా అరకొరగా ఉన్నాయని కొత్తగూడెం కోర్టుకు వెళ్లాలంటే రెండు లేదా మూడు బస్సులు మారాల్సిన పరిస్థితి ఉన్నదని సామాయనికి కోర్టుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని,ఖర్చు కూడా ఎక్కువగా అవుతుందని ఈ రెండు మండలాల్లో గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు మరియు ఇది st నియోజకవర్గ౦ ఇప్పటికే రిజిస్టర్ ఆఫీసు లు,mvi ఆఫీసులు మొత్తం కూడా కొత్తగూడెం వెళ్లిపోయినవి. కోర్టుల కు కూడా కొత్తగూడెం వెళ్ళాలంటే గిరిజనులు గిరిజనేతరులు కూడా పూర్తిగా అసౌకర్యాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొన్నదని కావున ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే అశ్వారావుపేట నియోజక వర్గ పరిదిలో దమ్మపేటలో JFCM కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
Post A Comment: