మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం మహాదేవపురం రైతు వేదికలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన మినుములు కందులను 30 మంది రైతులకు నాలుగు కిలోల చొప్పున స్థానిక కోఆర్డినేటర్ ఎంపీటీసీ మడకం రామారావు, ఏ ఈ ఓ ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ సుమిత్ర పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వ్యవసాయ అధికారి రైతులకు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ లో వాడే విత్తనాలు ఎరువులు గుర్తింపు తగినవి తీసుకోవాలని నకిలీ విత్తనాలను వాడరాదని ప్రభుత్వ నిషేధిత మందులకు అనుమతి లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి సభ్యులు సాగినేని సుబ్బరాజు మహాదేవపురం రైతు వేదిక క్లస్టర్ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: