CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తో పాటు 160 కుటుంబాలు పార్టీకీ రాజీనామా.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, రామన్నగూడెం గ్రామంలో పొడు భూముల విషయంలో తమకు హక్కు పాత్రలు ఇస్తానన్నా హామీని నిలపెట్టుకోవలని, అలానే తమ గ్రామ సమస్యలు పరిష్కారానికి సీఎం కేసీఆర్ కి తెలపడం కోసం ప్రగతి భవన్ హైదరాబాద్ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో సోమవారం పోలీసులు గిరిజనులపై చేసిన దాడిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఖండించకుండా సమర్ధించడంతో రాజీనామ చేస్తున్నాం అని తెలియజేసారు. రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప మాట్లాడుతూ, పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తే అశ్వారావుపేట ఎంపిపి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మా మాట వినకపోతే మీరు ఇబ్బంది పడతరంటూ బెదిరించారని ఆరోపిస్తూ, అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయితీ నుండి టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మడకం స్వరూప, తో సహా 160 కుటుంబాలు, అలానే రామన్న గూడెం పంచాయితీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు వార్డు మెంబర్లు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా. అశ్వారావుపేట ఎంపిపి జల్లిపల్లి శ్రీరామా మూర్తి, హరితహారం మొక్కల్లో భారీగా మొక్కలు రేట్లను చూపించి పంచాయితిని నుండి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణ. అలానే అశ్వారావుపేట లో నూతన ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవనికి, ఒక్కో పంచాయితీ నుండి 10 వేలు నుండి 5 వేలు వరుకు వసూలు చేశారంటూ ఆరోపిస్తూ. రామన్నగూడెం పంచాయితీ నుండి 5000/- ఇచ్చామని తెలిపిన రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప.

Share it:

TS

Post A Comment: