మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల తన సత్తాను చాటుకుంది. అధ్యాపకుల మార్గదర్శకత్వం, విద్యార్థుల మంచి ఫలితాన్ని ఇచ్చింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు సాగరిక, సత్యదుర్గలు 1000 మార్కులకు గాను 947, 917 మార్కులు సాధించడం జరిగింది.బైపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని శోభన 1000 మార్పులకు గాను, 944 మార్కులు సాధించింది. సి ఈ సి , హెచ్ ఈ సి విద్యార్థులు సిద్దార్థ, వసీంపాషా లు 740, 736 మార్కులు సాధించడం జరిగింది.ప్రథమ సంవత్సర ఎంపీసీ బైపిసిసి సి ఈ సి విద్యార్థులు అభిషేక్, నిరీశ సంతోశ్ లు 470 కి గాను 452, 440 కి గాను 419,500 కు గాను 460 మార్కులు సాధించారు.ఈ ఘనత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శేషుబాబు, అధ్యాపకులు అభినందించారు.
Post A Comment: