మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఆదివారం నాడు అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామం నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి వివిధ రకాల సమస్యల మీద వినతి పత్రం అందజేశారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, పినపాక నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు అశోక్ కుమార్, మండల సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, మండల సీనియర్ నాయకులు, మండల యువజన నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: