దమ్మపేట జూన్ 26 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండల కేంద్రంలో నాయకపోడు సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నాయకపోడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుల బుచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ రాష్ర్ట ప్రభుత్వం నాయకపోడు సమస్యలు పరిష్కరించటంలో విఫలం అయిందని అందరం ఐక్యంగా ఉండి సమస్యల సాధన కోసం పోరాటాలు చేద్దామని తెలిపారు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయాలని నాయకపోడు గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు ఓట్ల కోసమే నాయకపోడ్ లు గుర్తుకు వస్తారని ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీను ,జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేష్ మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణ పెద్దలు కొయ్యల అచ్యుతరావు మాజీ ఎంపీపీ జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
Post A Comment: