మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పోడు దారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు దండ లింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన పోడు దారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మద్దుకూరు, బెండాలపాడు గ్రామ శివారు లోని కొత్త కోయిల గ్రామాలపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి, మహిళలు, గర్భిణీ ల పై దాడి చేయడం తగదన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో తాడి పై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం పోడుదారులు నుండి దరఖాస్తులు తీసుకుంటే ఫారెస్ట్ అధికారులు దాడులు చేయటం, ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సంఘం బాధ్యులు బాణాల లక్ష్మీనారాయణ చారి, వీరు నాయక్, కొండల్ రావు, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: