CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వంతో లడాయికి సిద్ధమవుతున్న ఎల్ హెచ్ పి ఎస్...

Share it:

 



  •  జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో నూతన కమిటీలు ఏర్పాటు దిశగా కార్యాచరణ..


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 5 మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన లంబాడ హక్కుల పోరాట సమితి సంఘ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ గ్రామాన యల్ హెచ్ పి యస్ నూతన కమిటీ నీ ఏర్పాటు చేయాలనీ, జిల్లా కమిటీని ఆదేశించారు. అదేవిదంగా షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ లో ఉన్నా 100% రిజర్వేషన్ కోసం రాష్ట్రము లో గిరిజన దమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని, అదేవిదంగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రం కలిపించాలని డిమాండ్ చేస్తూ, గిరిజన ప్రజలను చైతన్యావంతంచేసి రాష్ట్ర ప్రభుత్వంతో లాడాయికీ సిద్దహస్థులు చేస్తామని, ఏజెన్సీ ప్రాంతంలో హక్కులకై నిరంతరం యల్ హెచ్ పి యస్ కమిటీ పని చేస్తుందని అన్నారు. అన్ని మండలాలో జిల్లా కమిటీ పర్యటించి మండల కమిటీ సహకారంతో గ్రామ కమిటీలను బలోపేతం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశం లో యల్ హెచ్ పి యస్ జిల్లా అధ్యక్షులు భూక్యా పంతులు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కేశ్యా నాయక్, వైరా నియోజకవర్గం ఇంచార్జి లకావత్ నాగేశ్వరావు, జూలూరు పాడు మండల అధ్యక్షులు గుగులోత్ మండలం లోని గిరిజన సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: