మన్యం టీవీ దుమ్ముగూడెం :: దుమ్ముగూడెం అటవీశాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో చర్ల మండలం దేవరపల్లి గ్రామానికి వృత్తిలో భాగంగా తనిఖీ నిర్వహణకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామం వద్ద ఎదురుగా వాహనం రావడంతో తప్పించబోయే క్రమంలో అధికారుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది సుమారు ఆరు అడుగుల లోతులో వాహనం బోల్తా కొట్టింది ఈ ఘటనలో దుమ్మగూడెం రేంజర్ కనకమ్మ, ఐదుగురు ఎఫ్ బి ఓ లు విజయ్, నరేష్, రాజేష్, వెంకటరత్నం, వెంకటేశ్వర్లు సిబ్బంది, డ్రైవర్ తో సహా మొత్తం తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. వీరిలో లో రాజేష్ వెంకటరత్నం వెంకటేశ్వర్లు తీవ్రగాయాలు కావడంతో, ములక పాడు పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పర్యావరణ దినోత్సవం రోజు అటవీశాఖ అధికారులు ప్రమాదానికి గురవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు..
Navigation
Post A Comment: