గుండాల జూన్ 5(మన్యం మనుగడ) తుడుం దెబ్బ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జవ్వాజి లక్ష్మీనారాయణ విగ్రహ తుడుం దెబ్బ నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. విగ్రహ ఆవిష్కరణకు తుడుందెబ్బ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు భారీగా హాజరయ్యారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆదివాసి ప్రజానీకం కోసం జవ్వాజి లక్ష్మీనారాయణ వెలలేని కృషి చేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాల పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఆదివాసీ ప్రజానీకం కోసం వారి హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. తుడుందెబ్బ ఆవిర్భావం నాటి నుండి పనిచేస్తూ దెబ్బ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణా లక్ష్మయ్య, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, గుండాల ఎంపీటీసీ సంధాని, మామ కన్ను సర్పంచ్ ముత్యమా చారి, మాజీ ఎంపీటీసీ రామయ్య, బొమ్మెర శ్రీనివాస్, వాగా బోయిన చంద్రయ్య దొర, వజ్జ ఎర్రయ్య, మోకాళ్ళ కన్నయ్య, గోవింద నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: