CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్బంగా మొక్కను నాటిన ఐదు సంవత్సరాల చిన్నారుడు గుద్దేటి సాహిత్.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: ప్రతి సంవత్సరం జూన్ 5 తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈక్రమంలో పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఈ నేపధ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా శనివారం అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల చిన్నారరుడు (గుద్దేటి సాహిత్) వాళ్ళ తాతగారు అయినా గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో మొక్క నాటడం జరిగింది. ఈ సందర్బంగా వాళ్ళ అమ్మగారు గుద్దేటి సత్యవాణి మాట్లాడుతూ.. వేగవంతమైన జీవన విధానంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లు తోందని. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని. ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్కను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు భీజం వెయ్యొచ్చు అని. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లవాడితో మా చిన్నారి గుద్దేటి సాహిత్ తో ఇంటి ప్రాంగణంలో మొక్క నాటియటం జరిగింది అని, నివాస యోగ్యమైన పరిసరాలు కల్పన, రానున్న తరాలకు మంచి ఆరోగ్య కరమైన వాతావరణం అందించే లక్ష్యంతో, చిన్నపిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందని ఈ క్రమంలో మొక్క నాటటం జరిగిందని అన్నారు.

Share it:

TS

Post A Comment: