CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి రాజీ యే రాచ మార్గం :ఎస్సై కిన్నెర రాజశేఖర్

Share it:

 


గుండాల జూన్ 5(మన్యం మనుగడ) నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ సూచించారు. ఈనెల 26వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నీ కోర్టు నందు నిర్వహించబడుతుంది అన్నారు. గుండాల స్టేషన్ పరిధిలో కేసుఉన్న వ్యక్తులు రాజీ పడాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇరుపక్షాలు సంప్రదించినట్లయితే అదాలత్ లో రాజీ కుదిర్చి కేసు కొట్టి వేయబడతాయి అని ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. రాజీ పడటం వల్ల ఇరుపక్షాలు గెలిచినట్టే నని ఆయన అన్నారు. ఏండ్ల తరబడి వాయిదాలకు తిరుగుతున్న కేసులు సైతం రాజీ పడటం ద్వారా కొట్టి వేయబడతాయి అని ఆయన అన్నారు. రాజీ పడాలి అనే ఉద్దేశం ఉన్నది వారు నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Share it:

TS

Post A Comment: